వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిబిఐపై విజయ సాయి పిటిషన్: జూలై 17కు వాయిదా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vijaya Sai Reddy
న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)కి స్వయంప్రతిపత్తి ఉండేలా చూడాలన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆడిటర్ విజయ సాయి రెడ్డి పిటిషన్ పైన విచారణను ఢిల్లీ కోర్టు జూలై 17వ తేదికి వాయిదా వేసింది. అదే రోజు కేంద్రం, సిబిఐ వాదనలు వింటామని కోర్టు తెలిపింది.

కాగా, సిబిఐకి స్వయం ప్రతిపత్తి ఉండేలా చూడాలని విజయ సాయి రెడ్డి గతేడాది జూలైలో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. అనంతరం విచారణనను వచ్చే వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వానికి, సిబిఐకి, సివిసికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విజయ సాయి రెడ్డి పిటిషన్ పైన కౌంటర్ దాఖలు చేయాలని వారిని ఆదేశించింది.

వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సిబిఐకి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని, సిబిఐ సివిసి నియంత్రణలో ఉండేలా చూడాలని, కేంద్ర ప్రభుత్వం నియంత్రణలో ఉండటం వల్ల సిబిఐ స్వేచ్ఛగా ఉండే అవకాశం లేదని తన పిటిషన్‌లో సాయి రెడ్డి పేర్కొన్నారు. గతంలోనూ విజయ సాయి రెడ్డి ఇదే అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అప్పుడు హైకోర్టు ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ అంశాన్ని సుప్రీం కోర్టులో తేల్చాలని ఆయనకు సూచించింది. దీంతో విజయ సాయి రెడ్డి మళ్లీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జగన్ అక్రమాస్తుల కేసు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో జగన్ ఏ-1 నిందితుడు కాగా విజయ సాయి రెడ్డి ఏ-2గా ఉన్నారు.

English summary
Delhi High Court has adjourned YSR Congress Party chief YS Jaganmohan Reddy audior Vijaya Sai Reddy's peition to July 17th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X