వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం బ్రేక్: ఒడిషా అభ్యంతరాలే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Break to Polavaram Padayatra
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం బ్రేక్ వేసింది. ఒడిషా ప్రభుత్వం అభ్యంతరాల నేపథ్యంలో కేంద్రం పోలవరం ప్రాజెక్టు పైన వెనక్కి తగ్గింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆపివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఓడిషా అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా నిర్మాణం సాధ్యం కాదని అభిప్రాయపడింది.

త్వరలోనే ఒడిషా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల అభిప్రాయాలను సేకరిస్తామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి హరీష్ రావత్ తెలిపారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు పైన ఓ నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. అప్పటి వరకు నిర్మాణం పనులు ఆపాలని ఆయన ప్రభుత్వాన్ని ఆదేశించారు.

పోలవరం ప్రాజెక్టు విషయంలో ఒడిషా అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల కేంద్రమంత్రి హరీష్ రావత్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. తమ పర్యావరణ అభ్యంతరాలతో పాటు మూడు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బ్రేక్ వేశారు.

కాగా, పోలవరం ప్రాజెక్టుకు నెల రోజుల క్రితం ముహూర్తం ఖరారు చేసి రైతులు ప్రారంభించిన విషయం తెలిసిందే. గత నెల ఎనిమిదో తేదిన ఉదయం 6.57 నిమిషాలకు పోలవరం ప్రాజెక్టు తదిపరి పనులను రైతులు ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టు పనులను ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ చేజిక్కించుకుంది.

English summary
Central Government ordered state government to stop Polavaram project works.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X