వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అది జగన్ ఖాతాలోకే..!: విజయమ్మకు వివేకా మద్దతు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vijayamma
హైదరాబాద్: తమ ఒత్తిడి కారణంగానే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు తగ్గించిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ శుక్రవారం అన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దీక్షా శిబిరంలోనే నివాళులు అర్పించింది. జగ్జీవన్ రామ్ చిత్రపటానికి విజయమ్మ పూలమాల వేశారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడారు.

అణగారిన వర్గాల కోసం జగ్జీవన్ రామ్ ఎంతో కృషి చేశారన్నారు. ఆయన చిరస్మరణీయులని, ఆయన మార్గంలో అందరూ నడువాలని సూచించారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కూడా దళితుల సంక్షేమం కోసం పాటుపడ్డారని చెప్పారు. కాగా వారి దీక్ష కొనసాగుతోంది.

తమ ఒత్తిడి కారణంగానే ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలపై కొద్దిగా దిగి వచ్చిందన్నారు. 200 యూనిట్లు దాటిన వారిని పెట్టుబడిదారులు అనడం సరికాదన్నారు. మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత కొండా సురేఖ వ్యక్తిగత కారణాలతోనే దీక్ష వద్దకు రాలేదని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విషయంలో మీడియా భూతద్దంలో చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఛార్జీలు పూర్తిగా తగ్గించే వరకు దీక్షలు కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నామని చెప్పారు.

క్షీణిస్తున్న ఆరోగ్యం

నిరాహార దీక్ష చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేల ఆరోగ్యం క్షీణిస్తోంది. వారికి ఈ రోజు వైద్యులు వారిని పరీక్షించారు. కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దీక్షకు వైయస్ వివేకానంద రెడ్డి సంఘీభావం తెలిపారు.

అంకెల గారడి

విద్యుత్ ఛార్జీల తగ్గింపుపై కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అంకెల గారడి ప్రదర్శించిందన్నారు. ఛార్జీలు పెంచింది రెండున్నర రూపాయలైతే తగ్గించింది రూపాయి మాత్రమేనని హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ కోతలపై కిరణ్ స్పందించడం లేదన్నారు.

English summary
YSR Congress Congress Party honorary president and Pulivendula MLA YS Vijayamma has clarified on Konda Surekha absence in her deeksha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X