హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ టిక్కెట్ వద్దన్నా ఇచ్చారు, 5 లక్షలతో విన్: సర్వే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sarve Satyanarayana
హైదరాబాద్: గత ఎన్నికల్లో తనకు టిక్కెట్ వద్దని దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పినా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇచ్చారని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ సోమవారం అన్నారు. ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ దూత అమర్ కాలేను సర్వే కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఇప్పుడు తన సీటు పైన చాలామంది కన్నేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను ఐదు లక్షల మెజార్టీతో మళ్లీ గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇస్తారనే నమ్మకం తమకుందన్నారు. తెలంగాణపై సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. కాంగ్రెసులో అసమ్మతి నేతలతో పార్టీకి నష్టం జరుగుతోందన్నారు. అసమ్మతి నేతలను విస్మరించవద్దన్నారు. సమన్వయలోపాన్ని సరిచేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. మల్కాజిగిరి స్థానాన్ని పలువురు నేతలు ఆశిస్తున్నారని, అయినా తనకే టిక్కెట్ ఇస్తారనే నమ్మకముందన్నారు.

జైపాల్ రెడ్డిపై ఫిర్యాదు

కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి పైన చేవెళ్ల నియోజకవర్గం నేతలు పలువురు అమర్ కాలేకు ఫిర్యాదు చేశారు. చేవెళ్లకు ఎంతో చేస్తారని ఈ నియోజకవర్గం నుండి జైపాల్ రెడ్డిని గెలిపిస్తే ఆయన గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా నియోజకవర్గానికి రాలేదని వారు ఫిర్యాదు చేశారు. మరోవైపు అమర్‌ను హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఆయన తనయుడు కార్తీక్ రెడ్డి కలుసుకున్నారు.

పాదయాత్రలతో ఒరిగేది లేదు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిలల పాదయాత్రలతో రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని మంత్రి కొండ్రు మురళీ శ్రీకాకుళం జిల్లాలో అన్నారు. ఆ పార్టీలలో వారి కుటుంబాలదే హవా అని విమర్శించారు.

English summary
Central Minister Sarve Satyanarayana said on Monday that he will win with 5 lakh majority from Malkajgiri in next general elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X