నా మార్కు చూపిస్తా: పర్యాటకంపై చిరంజీవి
ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 2013-14 ఆర్థిక సంవత్సరంలోనే వివిధ మెగా సర్కూట్ల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. చిరంజీవి సోమవారం నాడిక్కడ జూబ్లిహాల్లో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 12 నుంచి 14 వరకూ హైదరాబాద్లో జరగనున్న ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ (యుఎన్డబ్ల్యుటివో) సదస్సు ఏర్పాట్ల వివరాలను వివరించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్, కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి పర్వేజ్ దివాన్, అదనపు కార్యదర్శి గిరీష్ శంకర్, రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చందనా ఖన్ తదితరులు పాల్గొన్నారు.
దక్షిణాసియా, తూర్పు ఆసియా, పసిఫిక్ దేశాలకు చెందిన ప్రముఖులు ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. ఆయా దేశాల్లో 'స్థిరంగా పర్యాటక అభివృద్ధి' అనే అంశమే లక్ష్యంగా ఈ సదస్సులో చర్చలు జరగనున్నాయి. మొత్తం 29 దేశాలకు చెందిన 150 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని చిరంజీవి తెలిపారు.