సిఎం అవ్వవచ్చుననే భయమే: చిరుపై కోమటిరెడ్డి ఫైర్
వచ్చే ఎన్నికలలోగా కేంద్రం తెలంగాణ ఇవ్వని పక్షంలో తాను కాంగ్రెసు పార్టీ నుండి పోటీ చేయనని స్పష్టం చేశారు. అయితే, కాంగ్రెసు తెలంగాణ ఇస్తుందనే నమ్మకం తనకుందన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్కు చిరంజీవి లేఖ రాయడాన్ని ఆయన తప్పు పట్టారు. చిరు కాంగ్రెసులో సొంత ఇమేజ్ పెంచుకునేందుకే లేఖలు రాశాలని ఆరోపించారు.
కాంగ్రెసులోని దాదాపు యాభై మంది ఎమ్మెల్యేలు చిరంజీవి వ్యవహార శైలి పైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారన్నారు. కానీ, చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారేమోననే అభిప్రాయంతో వ్యతిరేకంగా మాట్లాడేందుకు భయపడుతున్నారని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి పాలనకు కోమటిరెడ్డి కితాబిచ్చారు.
ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాల పైన పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ఖండించారు. అవన్నీ కేవలం ఊహాగానాలే అన్నారు. మే చివరికల్లా తెలంగాణపై కేంద్రం నుండి స్పష్టమైన ప్రకటన వస్తుందనే ఆశాభావాన్ని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యక్తం చేశారు.