హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దాల్మియా ఛార్జీషీటునే ఫైనల్‌గా చూడండి: విజయసాయి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vijaya Sai Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఎ2 నిందితుడు విజయ సాయి రెడ్డి బుధవారం నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టులో మెమో దాఖలు చేశారు. దాల్మియా సిమెంటు పైన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) దాఖలు చేసిన ఐదో ఛార్జీషీటు పైన ఆయన ఈ రోజు మెమో దాఖలు చేశారు.

జగన్ ఆస్తుల కేసులో దాల్మియా సిమెంటు అంశంపై సిబిఐ ఐదో ఛార్జీషీటు దాఖలు చేసి అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిందని ఆయన తన మెమోలో పేర్కొన్నారు. సుప్రీం ఆదేశాలు ఉల్లంఘించినందున దాల్మియా సిమెంటు పైన దాఖలు చేసిన ఛార్జీషీటునే ఫైనల్ ఛార్జీషీటుగా భావించాలని ఆయన కోర్టును కోరారు.

గతేడాది అన్ని అంశాలను కలుపుకొని ఒకే ఛార్జీషీటు దాఖలు చేయాలని సుప్రీం కోర్టు సిబిఐని ఆదేశించిందని, దీంతో ఏడు అంశాలపై దర్యాఫ్తు చేసి ఒకే ఛార్జీషీటును ఆఖరున దాఖలు చేస్తామని సిబిఐ నాడు సుప్రీం కోర్టుకు తెలిపిందని, ఇప్పుడు కేవలం దాల్మియాపై ఐదో ఛార్జీషీటు దాఖలు చేయడం సరికాదన్నారు.

సుప్రీం కోర్టు ఆదేశాలు ఉల్లంఘించినందున దాల్మియా ఛార్జీషీటునే ఆఖరు ఛార్జీషీటుగా గుర్తించాలని విజయ సాయి రెడ్డి తన మెమోలో సిబిఐ ప్రత్యేక కోర్టును కోరారు. కాగా, మూడు రోజుల క్రితం సిబిఐ జగన్ ఆస్తుల కేసులో మరో ఛార్జీషీటును దాఖలు చేసిన విషయం తెలిసిందే.

English summary
YSR Congress party chief YS Jaganmohan Reddy auditor Vijaya Sai Reddy has filed a memo in CBI court on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X