దాల్మియా ఛార్జీషీటునే ఫైనల్గా చూడండి: విజయసాయి
జగన్ ఆస్తుల కేసులో దాల్మియా సిమెంటు అంశంపై సిబిఐ ఐదో ఛార్జీషీటు దాఖలు చేసి అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిందని ఆయన తన మెమోలో పేర్కొన్నారు. సుప్రీం ఆదేశాలు ఉల్లంఘించినందున దాల్మియా సిమెంటు పైన దాఖలు చేసిన ఛార్జీషీటునే ఫైనల్ ఛార్జీషీటుగా భావించాలని ఆయన కోర్టును కోరారు.
గతేడాది అన్ని అంశాలను కలుపుకొని ఒకే ఛార్జీషీటు దాఖలు చేయాలని సుప్రీం కోర్టు సిబిఐని ఆదేశించిందని, దీంతో ఏడు అంశాలపై దర్యాఫ్తు చేసి ఒకే ఛార్జీషీటును ఆఖరున దాఖలు చేస్తామని సిబిఐ నాడు సుప్రీం కోర్టుకు తెలిపిందని, ఇప్పుడు కేవలం దాల్మియాపై ఐదో ఛార్జీషీటు దాఖలు చేయడం సరికాదన్నారు.
సుప్రీం కోర్టు ఆదేశాలు ఉల్లంఘించినందున దాల్మియా ఛార్జీషీటునే ఆఖరు ఛార్జీషీటుగా గుర్తించాలని విజయ సాయి రెడ్డి తన మెమోలో సిబిఐ ప్రత్యేక కోర్టును కోరారు. కాగా, మూడు రోజుల క్రితం సిబిఐ జగన్ ఆస్తుల కేసులో మరో ఛార్జీషీటును దాఖలు చేసిన విషయం తెలిసిందే.