185కే నిత్యావసరాలు: అమ్మహస్తం ప్రారంభించిన కిరణ్

ఈ రోజు ముఖ్యమంత్రి దీనిని ప్రారంభించారు. తెల్లకార్డుదారులకు రూ.185కే తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేయనున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. రవీంధ్రభారతిలో జరుగుతున్న ఉగాది వేడుకల్లో ఆయనతో పాటు మంత్రులు దానం నాగేందర్, శ్రీధర్ బాబు, సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
గవర్నర్, సిఎంలకు ఆహ్వానం
ఖమ్మం జిల్లా భద్రాచలంలో జరిగే శ్రీరామ నవమి ఉత్సవాల్లో పాల్గొనడానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలకు ఆహ్వానం అందింది. భద్రాచలంలో ఈ నెల 19న సీతారాముల కల్యాణం, 20న పట్టాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు. దీనికి వారిని ఆలయ అర్చకులు ఆహ్వానం అందించారు.
పార్టీ కార్యాలయాల్లో ఉగాది వేడుకలు
తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు జరుపుకున్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం, బిజెపి తదితర పార్టీ కార్యాలయాల్లో ఉగాది వేడుకలు జరిగాయి. ఆయా పార్టీ కార్యాలయాల్లో జరిగిన ఉగాది వేడుకలో పార్టీ నేతలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications