సబిత ఇంటికెళ్లవచ్చు, కిరణ్ దానకర్ణుడి ఫోజులు: బాబు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దానకర్ణుడిలా ఫోజులిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ఏడాదిలో కాంగ్రెసు ప్రభుత్వం పథకాల పేరుతో జిమ్మిక్కులు చేస్తోందన్నారు. మరోసారి కాంగ్రెసు పార్టీని నమ్మితే ఇళ్ల పైన కప్పులను కూడా అమ్ముకోవాల్సి ఉంటుందన్నారు.
అమ్మహస్తం ఓ దండుగ పథకం అన్నారు. అది అమ్మహస్తం కాదని మొండి హస్తం అన్నారు. పేదలపై ఛార్జీల పేరుతో, పన్నుల రూపంలో భారం వేస్తూ భారీగా దండుకుంటున్న ప్రభుత్వం రూ.185కు తొమ్మిది సరుకులు ఇస్తామనడం దారుణమన్నారు. పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
విద్యుత్ను సక్రమంగా ఇవ్వలేని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు లేదన్నారు. శాంతిభద్రతలను కాపాడలేని హోమంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఇంటికి వెళ్లవచ్చునన్నారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
చిత్తూరు జిల్లా కలెక్టర్కు లేఖ
చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సంపై చంద్రబాబు చిత్తూరు జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని, బాధితులను ఆదుకోవాలని చంద్రబాబు తన లేఖలో కోరారు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications