నిబంధనల మేరకే జగన్ ములాఖత్లు: కృష్ణంరాజు

ములాఖత్ విషయంలో విఐపిలకు, రాజకీయ నేతలకు కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని, వాటి ఆధారంగానే జగన్తో మాట్లాడేందుకు ఆ పార్టీ నేతలకు అనుమతి ఇస్తున్నామన్నారు. విఐపిలకు, రాజకీయ నాయకులకు వారానికి నాలుగుసార్లు అవకాశం ఉంటుందని తెలిపారు. 15 రోజులకు ఒకసారి కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అవకాశం ఇస్తామన్నారు.
కోర్టు అనుమతి, జైళ్ల శాఖ నిబంధనల మేరకు జగన్ను ఎవరైనా కలిసే అవకాశం ఉంటుందని, జైళ్ల శాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవవహరించడంలేదని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలను అతిక్రమించి వైయస్ జగన్కు ములాఖత్లు ఇస్తున్నారని, చంచల్గుడా జైలును జగన్ పార్టీ కార్యాలయంగా మార్చుకున్నారని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తోంది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలనుకునే నాయకులు జైలుకు వెళ్లి వైయస్ జగన్ను కలుస్తున్న విషయం తెలిసిందే. అయితే, ములాఖత్లన్నీ నిబంధనల మేరకే జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications