నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ కోసం ఆత్మహత్య!: పైరసీ సిడిల పట్టివేత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Youth commits suicide
హైదరాబాద్/నెల్లూరు: హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ కోసమే ఆత్మహత్య చేసుకున్నట్లుగా సూసైడ్ నోట్ రాసి చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి నవీన చారిగా గుర్తించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మోసం చేస్తున్నారని సూసైడ్ లేఖలో నవీన చారి ఆరోపించారు. త్వరగా తెలంగాణ రావాలని ఆకాంక్షించారు.

టాంజానియాలో గుంటూరు వాసి మృతి

టాంజానియాలో గుంటూరు జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందారు. టాంజానియాలోని దారుస్సలేంలో అతను మృతి చెందాడు. అతని మృతదేహాన్ని భారత్ తీసుకు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని బంధువులు, కుటుంబ సభ్యులు అధికారులను అభ్యర్థించారు.

కావలిలో కానిస్టేబుల్ హల్ చల్

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కావలిలో ఓ పోలీసు కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. తప్ప తాగి స్థానికులపై దాడి చేశాడు. స్థానికులు అతనిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన కావలి వన్ టౌన్ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది.

ఇంటర్‌లో ఫెయిలై...

హైదరాబాదులోని లాలాపేటలో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ మొదటి సంవత్సరంలో ఫెయిలైనందువల్లే ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

పైరసీ సిడిల పట్టివే

మైలార్ దేవపల్లిలో బాద్ షా, గుండె జారి గల్లంతయ్యిందే, శ్రీరామ్ చిత్రాల పైరసీ సిడిలను పట్టుకున్నారు. దాదాపు వెయ్యి సిడిలను పోలీసులు స్వాధీనం చేసుకొని, నిర్వాహకులలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.

English summary
One Youth committed suicide on Sunday morning near Hitech City Railway Station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X