వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు ఖూనీకోరు: ఈటెల, కొనసాగిస్తాం: హరీష్

By Pratap
|
Google Oneindia TeluguNews

etela rajender and harish rao
హైదరాబాద్/ వరంగల్: బయ్యారం గనుల విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు కల్లు తాగిన కోతుల్లాగా మాట్లాడుతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్షథ నేత ఈటెల రాజేందర్ మండిపడ్డారు.

దొంగే దొంగా దొంగా అన్నట్టు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.. చంద్రబాబు ఓ ఖూనీకోరు, దగుల్బాజి అంటూ ఈటెల వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కూడా ఆయన విరుచుకుపడ్డారు.

కిరణ్‌ కుమార్ రెడ్డి నీతి, నిజాయితీ లేని వ్యక్తిలా వ్యవహరిస్తున్నారని, బయ్యారంపై జీవోను వెనక్కి తీసుకోకుంటే రాష్ట్రం అగ్నిగుండమే అవుతుందని ఈటెల హెచ్చరించారు.

బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టే వరకు మా ఉద్యమం కొనసాగుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేత హరీశ్‌రావు తెలిపారు. బయ్యారం గనుల తరలింపునకు తెలంగాణ మంత్రుల అసమర్థతే కారణమని ఆయన ఆరోపించారు. బయ్యారం విషయంలో తెలంగాణ, అంధ్ర మంత్రుల ప్రకటనలకు మధ్య పొంతన లేదని ఆయన అన్నారు.

బయ్యారం గనుల విషయంలో సీమాంధ్ర, తెలంగాణ మంత్రులు ప్రతిపక్ష నేతల మాదిరిగా విమర్శలు చేసుకుంటున్నారని ఆయన అన్నారు. బయ్యారం గనులను వైయస్ రాజశేఖర రెడ్డి తన అల్లుడికి దోచి పెడితే సీఎం కిరణ్ ఆంధ్రకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నాడని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary
Telangana Rastra Samithi (TRS) leader Etela Rajender retaliates the Telugudesam leaders comments on Bayyaram issue. TRS MLA Harish Rao said that TRS will continue movement on Bayyaram issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X