వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మగాళ్లను దింపేది ఆడాళ్లే: ఎంపి కాంగ్రెసు నేత

By Pratap
|
Google Oneindia TeluguNews

madhya pradesh
భోపాల్: మహిళలపై సెక్సిస్టు వ్యాఖ్య చేసి మధ్యప్రదేశ్ కాంగ్రెసు నాయకుడు వివాదంలో చిక్కుకున్నారు. పురుషులపై ఆహ్వానిస్తున్నట్లు చూడడం వల్లనే మహిళలు చిక్కుల్లో పడుతున్నారని ఆ నాయకుడు అన్నారు. ఈ కాంగ్రెసు నాయకుడి వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ బిజెపి నాయకులు విరుచుకుపడుతున్నారు.

"జబ్ తక్ మహిళా తిర్చి నజర్ సే నహీ దేఖేగీ, తబ్ తక్ పురుష్ ఉనే నహీ చేఢేగా" (పురుషుడి వైపు ఓరచూపులు చూడకపోతే పురుషుడు మహిళను వేధించడు) అని మాజీ మంత్రి సత్యదేవ్ కటారా అన్నారు. భింద్ జిల్లాలో జరిగిన ర్యాలీలో ఆయన ఆ వ్యాఖ్య చేశారు.

ఈ ఏడాది చివరలో జరిగే ఎన్నికల్లో విజయం సాధించడానికి ఈ వారారంభంలో కాంగ్రెసు పార్టీ భింద్ జిల్లాలో ర్యాలీని ఏర్పాటు చేసింది. కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మహిళ అని, అటువంటి స్థితిలో కాంగ్రెసు నాయకుడు ఆ విధమైన వ్యాఖ్య చేయడం మహిళలను కించపరచడమేనని బిజెపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే విశ్వాస్ సారంగ్ అన్నారు.

సత్యదేవ్ వ్యాఖ్య కాంగ్రెసు నాయకులు బుద్ధిని తెలియజేస్తోందని, ఢిల్లీ అత్యాచారం తర్వాత వారి బుద్ధి బయటపడుతోందని అన్నారు. సత్యదేవ్ కటారా మధ్యప్రదేశ్ కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

English summary
A Congress leader in Madhya Pradesh has landed himself in a controversy by making sexist remarks that women invite trouble by looking at men in a suggestive manner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X