హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనుమానం: తాగిన మత్తులో భార్యను చంపిన భర్త

By Srinivas
|
Google Oneindia TeluguNews

Husband kills wife
నెల్లూరు/హైదరాబాద్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మైపాడు సెంటరు గేటు సమీపంలో ఓ భర్త తన భార్యపై అనుమానంతో హత్య చేసిన సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. మద్యం సేవించిన సదరు భర్త తాగిన మైకంలో భార్యను విచక్షణా రహితంగా నరికి ఆ తర్వాత గొంతుకోసి చంపాడు. ఆయన చర్యతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

ఇదే జిల్లాలలో పెల్లకూరు మండలం సరిసనంబేడు అడవులలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అతని మృతదేహాన్ని పరిసర ప్రాంతావాసులు శుక్రవారం ఉదయం గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పంచానామా నిమిత్తం నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. గుర్తు తెలియని వ్యక్తి హత్యగా కేసు నమోదు చేసుకున్నారు.

లారీని ఢీకొన్న పాల వ్యాను

పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాల సమీపంలో 16వ నంబరు జాతీయ రహదారిపై ఈ తెల్లవారుజామున సిద్ధాంతం నుంచి హనుమాన్ జంక్షన్ వెళ్తున్న పాల వాహనం ఓ లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

పసికందు మృతి

మెదక్ జిల్లా నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ పసికందు మృతి చెందింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే పసికందు మృతికి కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు.

English summary
A woman was allegedly murdered by her husband in Sri Potti Sriramulu Nellore district on Thursday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X