అనుమానం: తాగిన మత్తులో భార్యను చంపిన భర్త
ఇదే జిల్లాలలో పెల్లకూరు మండలం సరిసనంబేడు అడవులలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అతని మృతదేహాన్ని పరిసర ప్రాంతావాసులు శుక్రవారం ఉదయం గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పంచానామా నిమిత్తం నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. గుర్తు తెలియని వ్యక్తి హత్యగా కేసు నమోదు చేసుకున్నారు.
లారీని ఢీకొన్న పాల వ్యాను
పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాల సమీపంలో 16వ నంబరు జాతీయ రహదారిపై ఈ తెల్లవారుజామున సిద్ధాంతం నుంచి హనుమాన్ జంక్షన్ వెళ్తున్న పాల వాహనం ఓ లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
పసికందు మృతి
మెదక్ జిల్లా నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ పసికందు మృతి చెందింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే పసికందు మృతికి కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు.