జగన్ భూములు రద్దు చేసే ధైర్యం ఉందా: రేవంత్

Revanth Reddy
హైదరాబాద్: ఖమ్మం జిల్లా బయ్యారం గనులకు సంబంధించి లేని సమస్యను సృష్టించి, దాన్ని పరిష్కరిస్తామంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, దానిపై పోరాడుతామంటూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రాకరం బయ్యారం గనులను ప్రైవేట్ సంస్థకు కేటాయించే అధికారం ఎవరికీ లేదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

ఉక్కు లేదు, తుక్కు లేదు అని తెలిసి కూడా ఉత్తుత్తి కర్మాగారమంటూ ముఖ్యమంత్రి రాజకీయ మనుగడ సాగించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన మంత్రి గంటా శ్రీనివాసరావుపై మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్‌ పట్ల వ్యవహరించిన రీతిలోనే ముఖ్యమంత్రి కేసు నమోదు చేయించాలని ఆయన అన్నారు.

ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కిరణ్ కుమార్ రెడ్డి నుంచి రాజీనామా లేఖలను అధిష్టానం తీసుకుందని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో తమ పదవులు కాపాడుకునేందుకు వీరు ఏకంగా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి, లేని సమస్యలు సృష్టించి పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నట్లు నాటకాలు ఆడుతున్నారని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రికి అంత ధైర్యం ఉంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఎండిగా ఉన్న సరస్వతి సిమెంట్స‌కు గుంటూరు జిల్లా దాచేపల్లిలో కేటాయించిన భూములను రద్దు చేయకుండా ఫైల్‌ను ఎందుకు పెండింగ్‌లో ఉంచారని ఆయన ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+