వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కూలిన ఆస్పత్రి భవనం: శిథిలాల కింద 20 మంది?
టీవీ కథనాల ప్రకారం - 10 మంది రక్షించారు. నిర్మాణంలో ఉన్న కస్తూర్బా గాంధీ ఆస్పత్రిలో మహిళా విభాగం కూలింది. వివరాలు అందాల్సి ఉంది. నలుగురు రోగులు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిని ఖాళీ చేయించారు. గాయపడిన రోగులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. కూలిన భవనం దశాబ్దాల కాలం నాటిది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ప్రమాదం ఎలా సంభవించిందనేది చూస్తామని ఆస్పత్రి అధికార వర్గాలంటున్నాయి.
ఆస్పత్రి భవనం పైకప్పు అకస్మాత్తుగా కూలిందని, కూలుతుందనే అనుమానం ఏ మాత్రం కలగలేదని అంటున్నారు. సహాయక చర్యలకు సైన్యం కూడా దిగింది. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించడంలో స్థానికులు కూడా సహకరిస్తున్నారు. ఈ ఆస్పత్రి ప్రభుత్వానికి చెందిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ నడుపుతోంది. ఇది భోపాల్లోని ఫతేఘర్లో ఉంది.
Comments
English summary
At least 35 people are feared trapped in debris when an under-construction hospital collapsed in Bhopal on Friday afternoon, Times Now reported.