వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూలిన ఆస్పత్రి భవనం: శిథిలాల కింద 20 మంది?

By Pratap
|
Google Oneindia TeluguNews

Building Collapse
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఓ ఆస్పత్రి భవనం కూలింది. నిర్మాణంలో ఉన్న ఆస్పత్రి కూలడంతో శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం సంభవించింది. శిథిలాల కింద 20 మంది చిక్కుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

టీవీ కథనాల ప్రకారం - 10 మంది రక్షించారు. నిర్మాణంలో ఉన్న కస్తూర్బా గాంధీ ఆస్పత్రిలో మహిళా విభాగం కూలింది. వివరాలు అందాల్సి ఉంది. నలుగురు రోగులు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిని ఖాళీ చేయించారు. గాయపడిన రోగులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. కూలిన భవనం దశాబ్దాల కాలం నాటిది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ప్రమాదం ఎలా సంభవించిందనేది చూస్తామని ఆస్పత్రి అధికార వర్గాలంటున్నాయి.

ఆస్పత్రి భవనం పైకప్పు అకస్మాత్తుగా కూలిందని, కూలుతుందనే అనుమానం ఏ మాత్రం కలగలేదని అంటున్నారు. సహాయక చర్యలకు సైన్యం కూడా దిగింది. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించడంలో స్థానికులు కూడా సహకరిస్తున్నారు. ఈ ఆస్పత్రి ప్రభుత్వానికి చెందిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ నడుపుతోంది. ఇది భోపాల్‌లోని ఫతేఘర్‌లో ఉంది.

English summary
At least 35 people are feared trapped in debris when an under-construction hospital collapsed in Bhopal on Friday afternoon, Times Now reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X