లెక్చరర్గా పని చేస్తా!: సిబిఐ జెడి, బ్రేకింగ్ న్యూస్పైనా..

రాబోయే కాలంలో అవినీతిరహిత సమాజం ఏర్పడితే సిబిఐ, పోలీసు శాఖల అవసరం ఉండదని అభిప్రాయపడ్డారు. ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా ఆయన ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం సూర్యనందన అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు.
విద్యార్థులు లక్ష్యం దిశగా పయనించాలన్నారు. ప్రపంచానికి సంస్కృతికి, సాంప్రదాయం నేర్పిన భారత దేశం ప్రస్తుతం సంస్కృతి, సాంప్రదాయం నేర్చుకునే స్థితిలో ఉందన్నారు. మీడియా మంచినే పోత్సహించే విధంగా ఉండాలన్నారు. అవినీతి రహిత సమాజం ఏర్పడితే సిబిఐ పదవి వదిలి లెక్చరర్గా పని చేస్తానన్నారు.
అనంతరం లక్ష్మీ నారాయణ కుటుంబ సమేతంగా జంగారెడ్డిగూడెం మండలంలోని గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆంజనేయస్వామికి విశేష పూజలు చేశారు. గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నారు.












Click it and Unblock the Notifications