బేగంపేటలో అత్యవసరంగా అద్వానీ ఫ్లైట్ ల్యాండింగ్

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఢిల్లీ తిరిగి వెళ్తుండగా అద్వానీ విమానం బేగంపేటలో ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఈ నెల 5వ తేదీన కర్ణాటక శానససభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇంధన సమస్య తలెత్తడంతో అద్వానీ విమానం బేగంపేట విమానాశ్రయంలో దిగింది. దాంతో అద్వానీ దాదాపు గంటన్నర పాటు బేగంపేట విమానాశ్రయంలో ఆగిపోయారు.
విమానం కదలడం కష్టమని చెప్పడంతో అద్వానీని రోడ్డు మార్గం ద్వారా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి ఆయన కర్ణాటక రాజధాని బెంగళూర్ చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో ప్రచారం జోరందుకున్న విషయం తెలిసిందే.
అద్వానీ విమానం అత్యవసరంగా బేగంపేట విమానాశ్రయంలో దిగడానికి గల మరిన్ని కారణాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications