జగన్ కేసు: లాయర్‌పై నిమ్మగడ్డ ప్రసాద్ భార్య ఆగ్రహం

Nimmagadda Prasad
న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) తరఫు లాయరు అశోక్ బాను పైన ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ భార్య ఆగ్రహం వ్యక్తం చేశారట. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం బెయిల్ పిటిషన్ పైన విచారణ జరిగింది. కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

విచారణ సందర్భంగా నిమ్మగడ్డ ప్రసాద్ సతీమణి ఆశా ప్రసాద్ కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె సిబిఐ తరఫు లాయరు పైన ఆగ్రహం వ్యక్తం చేశారట. లాయరు వాదనలు వినిపిస్తుండగా పలుమార్లు ఆమె సమాధానం చెప్పే ప్రయత్నాలు చేశారట. సిబిఐ వాదన తప్పని చెప్పే ప్రయత్నాలు చేశారట. సిబిఐ ఎస్పీ వెంకటేష్‌తో మాట్లాడిన ఆమె నిమ్మగడ్డ బెయిల్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని అడిగారు. అయితే తాము చట్టబద్దంగానే వెళ్తున్నామని వెంకటేష్ సమాధానం చెప్పారు.

విజయ సాయి రెడ్డి బెయిల్ పిటిషన్ పైన విచారణ రేపు

జగన్ ఆడిటర్ విజయ సాయి రెడ్డి కూతురు పెళ్లి మే 26వ తేదిన ఉందని న్యాయవాది రామచంద్రన్ కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. వేసవి సెలవుల తర్వాత విజయ సాయి బెయిల్ రద్దు పిటిషన్‌ను విచారించాలని సాయి తరఫు న్యాయవాది కోరారు. అలా అయితే కేసు మరింత జాప్యమవుతుందని, ఈ కేసులో ప్రధాన సూత్రదారి విజయ సాయి రెడ్డి అని, ఆయన బయట ఉంటే సాక్ష్యాలు తారుమారు చేస్తారని సిబిఐ తరఫు న్యాయవాది అన్నారు. రేపు విచారణకు రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+