సిగరెట్ కోసం హత్య చేశాడు: జీవిత ఖైదీగా జైలుకు..
మనుషులంటే నిందితుడికి లెక్క లేదని, పొట్ట పోసుకోవడానికి ఢిల్లీ వచ్చిన 32 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు తీశాడని, పేద వ్యక్తి నిందితుడికి సిగరెట్ ఇవ్వలేకపోయాడని, దానికి ప్రాణాలు తీశాడని అదనపు సెషన్స్ జడ్జి కామిని లావువా అన్నారు. దోషికి కోర్టు 15 వేల రూపాయల జరిమానా కూడా విధించింది.
సంఘటన 2010 నవంబర్ 27వ తేదీన సుల్తాన్పురి ప్రాంతంలో జరిగింది. తన బంధువులతో కలిసి సూరజ్ మార్కెట్కు వెళ్లి తిరిగి వస్తూ బీడీ తాగుతున్నారని, అది చూసి తనకు ఓ సిగరెట్ ఇవ్వాలని రాకేష్ అడిగాడని, తన వద్ద సిగరెట్లు లేవని సూరజ్ చెప్పాడని, దాంతో చంపుతానని రాకేష్ బెదిరించాడని కేసు నమోదైంది.
సిగరెట్ ఇవ్వకపోవడంతో రాకేష్ కత్తి తీసి సూరజ్ను పొడిచాడు. కాస్తా దూరంలో సూరజ్ బంధువులు రాకేష్పైకి ఇటుకలు విసిరారు. రాకేష్ అక్కడి నుంచి పారిపోయిన తర్వాత సూరజ్ను బంధువులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించాడు.