విజయమ్మతో భేటీ: వైయస్ జగన్ పార్టీలోకి దాడి?

హైదరాబాద్లోని చంచల్గూడ జైలులో శుక్రవారం జగన్ను కలిసి మిగతా విషయాలు మాట్లాడుకోనున్నారు. అంతా అనుకున్నట్టు జరిగితే ఈనెల 6న విజయలక్ష్మి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకుంటారు. విశాఖలో పార్టీ గెలుపునకు కృషి చేస్తానని, కొణతాలతో సఖ్యతతో పనిచేస్తానని హామీ ఇచ్చి, తన కుమారుడు రత్నాకర్కు అనకాపల్లి లేదా విశాఖ పశ్చిమసీటు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారని వైయస్సార్ కాంగ్రెసు వర్గాలు చెబుతున్నాయి.
అయితే, దాడి వీరభద్రరావు మాత్రం ఈమధ్య మంత్రి గంటా శ్రీనివాసరావును కలుసుకోవడం మరింత ఆసక్తి కలిగిస్తోంది. అదే సమయంలో 'కిరణ్కుమార్ రెడ్డి టచ్లో ఉన్నారు' అని దాడి కుమారుడు రత్నాకర్ అంటున్నారు. దాడి చూపు కాంగ్రెస్ వైపు ఉన్నదనే ఊహాగానాలు వస్తున్నాయి.
అయితే, దాడి వీరభద్రరావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. తనను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రెండోసారి శాసనమండలికి నామినేట్ చేయకపోవడంతో దాడి వీరభద్రరావు అలిగారు. దాంతో ఆయన టిడిపికి గుడ్బై చెప్పారు.












Click it and Unblock the Notifications