టిడిపి ఓడుతుందనే జగన్ వైపు: దాడి, కొణతాలపై క్లారిటీ

తాము అనకాపల్లి సీటును ఆశించడంలో ఏ తప్పు లేదన్నారు. కొణతాల వర్గానికి ఏమిస్తారో ఆ తర్వాత తన వరగానికి ఇచ్చే విషయం ఆలోచించమని జగన్కు చెప్పానన్నారు. కొణతాల విషయంలో తాను పార్టీ అధినేతకు ఎలాంటి షరతులు విధించలేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనకు చేసిందేమీ లేదని దాడి ఈ సందర్భంగా మండిపడ్డారు.
ఎన్టీఆర్ కేబినెట్లో తనకు చోటు దక్కకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. తనకు మండలి పదవిని ఇచ్చింది చంద్రబాబు కాదని, జిల్లా నేతలు అన్నారు. తెలుగుదేశం ఓడిపోతుందనే తాను పార్టీని వీడానని చెప్పారు. జగన్ అవినీతిపై ప్రశ్నిస్తే ఎవరు అవినీతిపరులు కాదని ప్రజలు ఎదురు ప్రశ్నిస్తున్నారన్నారు. పనికి మాలిన కార్యక్రమాలకు వెళ్లే చంద్రబాబు పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు ఎందుకు వెళ్లడం లేదన్నారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లుగా అనుమానాలు కలుగుతున్నాయన్నారు. అధికార కాంగ్రెసు పార్టీకి అనుకూలంగా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబులు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications