షర్మిల తాతను మించి మాట్లాడుతున్నారు: పొంగులేటి

షర్మిల తన తాతను మించి మాట్లాడుతున్నారని విమర్శించారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోని కళంకిత మంత్రుల వ్యవహారాన్ని తమ పార్టీ అధిష్టానం పరిశీలిస్తోందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. మంత్రులు పదవులు లేకున్నా పార్టీ కోసం పని చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
పేదవాడి అవసరాలు తీర్చడమే కాంగ్రెసు లక్ష్యం: గంటా
పేద ప్రజల అవసరాలు తీర్చడమే కాంగ్రెసు పార్టీ ధ్యేయమని మంత్రి గంటా శ్రీనివాస రావు ఆదివారం అన్నారు. విశాఖపట్నం జిల్లా పరవాడ సంతబైల వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అమ్మహస్తం పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు అందజేశారు.
గజల్ శ్రీనివాస్ చేరికపై నేతలు హర్షం
తెలుగు ప్రతిష్టను ప్రపంచానికి తెలియజేసిన గజల్ శ్రీనివాస్ కాంగ్రెసులో చేరటం సంతోషమని షబ్బీర్ అలీ అన్నారు. జగమెరిగిన పాటగాడు గజల్ శ్రీనివాస్ జాతీయవాదాన్ని సమర్థిస్తూ కాంగ్రెసులో చేరటం సంతోషకరమని మాజీ పిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ అన్నారు.
ప్రజలు, గజల్స్ ప్రస్తుతం తన ముందున్న లక్ష్యాలు అని గజల్ కాంగ్రెసులో చేరిన సందర్భంగా అన్నారు. కాంగ్రెసుకు సేవ చేయడం దేశానికి సేవ చేయడమే అన్నారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఓ ప్రచార కార్యకర్తగా తీసుకు వెళ్తానన్నారు. కాంగ్రెసు హ్యాట్రిక్ సాధించేలా కృషి చేస్తానన్నారు.












Click it and Unblock the Notifications