కుట్రలు వేర్వేరు, విచారణ వేర్వేరు: జగన్ కేసులో సిబిఐ

జగన్ ఆస్తుల కేసులో ఉమ్మడి విచారణ కుదరదని సిబిఐ చెప్పింది. నేరాలు వేర్వేరుగా ఉన్నాయని, విడివిడిగానే విచారణ జరపాల్సి ఉంటుందని సిబిఐ వాదించింది. కుట్రలు వేర్వేరుగా జరిగాయి కాబట్టి విచారణ కూడా వేర్వేరుగానే జరపాల్సి ఉంటుందని సిబిఐ వాదించింది. జగన్ కేసులో బ్రహ్మానంద రెడ్డికి బెయిల్ ఇవ్వకూడదని సిబిఐ వాదించింది.
కాగా, జగన్ ఆస్తుల కేసులో జగన్, మోపిదేవి, నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్ను కోర్టు జూన్ 3వ తేదీ వరకు పొడగించింది.జగన్, మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డిలను కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది.
ఇదిలా వుంటే, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, ఒఎంసి డైరెక్టర్ బివి శ్రీనివాస రెడ్డి రిమాండ్ను కూడా కోర్టు జూన్ 3వ తేదీ వరకు పొడిగించింది. వీరిద్దరిని కూడా కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది.












Click it and Unblock the Notifications