నాకేం సంబంధం లేదు: చంద్రబాబుపై కన్నా ఫైర్

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జారీ అయిన 12వ నెంబర్ జీవోను పట్టుకుని తనపై ఆరోపణలు చేస్తున్నారని, ఆ జీవో జారీతో తనకు ఏ విధమైన సంబంధం లేదని కన్నా అన్నారు. అంతకు ముందు జారీ అయిన రెండు జీవోల మేరకు జీవో నెంబర్ 12ను ప్రిన్సిపల్ సెక్రటరీ జారీ చేశారని ఆయన చెప్పారు. జీవో అసలు మంత్రి వద్దకు రాదని, తన వద్దకు ఆ జీవో రానే లేదని ఆయన చెప్పారు.
రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే తనపై బురద చల్లడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్సించారు. చంద్రబాబునాయుడిపై అవినీతి ఆరోపణలను మరిచిపోయారని అనుకుంటున్నారేమోనని ఆయన అన్నారు. తెలుగుదేశం సీనియర్ నాయకుడు అశోక గజపతిరాజుపై కూడా కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. అశోక్ గజపతి రాజు గతంలో మంత్రిగా ఎలా పనిచేశారో తెలియదని ఆయన అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో కన్నా లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో ఆ జీవో విడుదలైందనేది ప్రధాన ఆరోపణ. వివాదాస్పద జీవోలు జారీ చేశారంటూ ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆరుగురు మంత్రుల్లో కన్నా లక్ష్మినారాయణ ఒక్కరు. జగన్ ఆస్తుల కేసులో అందుకు సంబంధించి మోపిదేవి వెంకటరమణ అరెస్టయి మంత్రిపదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావులపై అభియోగాలు నమోదయ్యాయి.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications