నితీష్పై లాలు 'చిలుక' పలుకు: ఆకర్షణగా తనయులు

పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు పాట్నాలోని చారిత్రక గాంధీ మైదాన్లో బుధవారం భారీ 'పరివర్తన' ర్యాలీని లాలూ న్విహించారు. లాలూ కుమారులు తేజ్ప్రతాప్, తరుణ్ల రాజకీయ ఆరంగేట్రానికి వేదికగా ఈ ర్యాలీ నిర్వహించారు. గత దశాబ్దకాలంలో ఇంతటి భారీ సభను ఆర్జేడి ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం కావడం గమనార్హం.
తాను నిజమైన సెక్యులర్వాదినని లాలు స్పష్టం చేశారు. మతతత్వవాదులను ఢిల్లీ గద్దె ఎక్కనీయకుండా అడ్డు పడతానని పేర్కొన్నారు. నితీష్ నియంత అని, ఆయన పతనం మొదలైందని, నితీష్ లౌకిక విలువలు సందేహాస్పదమని, ఆయన ఆర్ఎస్ఎస్, బిజెపి ఒడిలో కూర్చున్న చిలుకలా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా విమర్శించారు.
ఎన్డీయే పాలనలో బీహార్ ప్రజలు అవినీతి, నేరాలతో విసుగెత్తిపోయారని, ఆ కూటమి పాలనను ఏవగించుకున్నారని, ఎన్డీయే సర్కారు పతనం వారి స్వయంకృపారాధమే అన్నారు. నితీష్ను గద్దె నుండి కిందకు తోస్తానని అన్నారు. ఆర్జెడి సభలో లాలు తనయుడు తేజ్ ప్రతాప్, తేజస్వి యాదవ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
వారిని వెలుగులోకి తీసుకు రావడానికి సభను సాధనంగా వాడుకున్నారు. ఆర్జెడి వ్యవహారాల్లో వారి ఆసక్తిని లాలు సభాముఖంగా సమర్థించుకున్నారు. తన కుమారులు పార్టీ గుర్తు లాంతరు పట్టుకుంటే తప్పేంటని, వారు లాంతరు కాకుండా కమలాన్ని, బాణాన్ని పట్టుకోవాలా అని ప్రశ్నించారు.
-
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం












Click it and Unblock the Notifications