వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్కరు పోతే 50 మంది లీడర్లను తయారు చేస్తా: బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నుండి ఒక్క నేత వెళ్లిపోతే తాను యాభై మందిని తయారు చేస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. పార్టీ జెండా మోసేవారిని అందరిని ఆదుకునే బాధ్యత తనదే అన్నారు. నేతలకు పదవులపై ఉన్న వ్యామోహం పార్టీపై ఏమాత్రం లేదన్నారు. మహనాడు తర్వాత ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఆయన అనకాపల్లి కార్యకర్తలతో భేటీ అయ్యారు.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టిడిపి జెండా రాష్ట్రంలో ఎగరాలన్నారు. ఆ దిశగా పార్టీ శ్రేణులు అంతా కలిసి పని చేయాలన్నారు. ప్రకాశం జిల్లా పర్చూరులో టిడిపి నేతలు పార్టీని విడిచి వెళ్లాక ఇతరులకు బాధ్యతలు అప్పగించానని, అక్కడ బ్రహ్మాండమైన మార్పు కనిపించిందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆ జిల్లాలో టిడిపి గెలిచే మొదటి సీటు పర్చూరే అన్నారు. అనకాపల్లిలోను అదే జరుగుతుందని జోస్యం చెప్పారు.

దాడి వీరభద్ర రావుతో కొంతమంది వెళ్లినా మిగిలిన వారంతా పార్టీలోనే ఉన్నారన్నారు. తెరాస కొన్ని జిల్లాలకే పరిమితమైన పార్టీ అని, కాంగ్రెసు రోజు రోజుకు క్షీణిస్తోందని, వైయస్సార్ కాంగ్రెసు దొంగల పార్టీ అని అన్నారు. టిడిపి మాత్రమే ప్రజలతో, కార్యకర్తలతో మమేకమవుతోందన్నారు. ఇక ప్రతి ఎన్నికల్లో ఇరవై శాతం మందికి కొత్తవారికి అవకాశం కల్పిస్తామన్నారు.

మహానాడు తర్వాత ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం చేపడతామని, పార్టీ నాయకులు, కార్యకర్తలు సహకరించాలన్నారు. అనకాపల్లి నియోజకవర్గానికి కోర్ కమిటీని త్వరలో నియమిస్తానని చెప్పారు. కార్యాచరణ ప్రణాళికను అందించి తానే స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పారు.

English summary
Anakapalli Constituency Telugudesam Party leaders were met TDP chief Nara Chandrababu Naidu on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X