నిర్దోషిగా నిరూపించుకుంటా, దాచలేదు: ధర్మాన వివరణ

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) వంటి దర్యాఫ్తు సంస్థలు అభియోగాలు మోపినంత మాత్రాన దోషులుగా తేల్చకూడదన్నారు. తమను నిత్యం కళంకిత మంత్రులు అనడంపై ధర్మాన ఆవేదన వ్యక్తం చేశారు. దర్యాఫ్తు సంస్థలు ఆరోపణలు చేసినంతనే దోషులు కాదని, కోర్టులో రుజువు కావాలన్నారు. కేబినేట్ ముందు కొన్ని విషయాలను దాచి పెట్టారనేది సిబిఐ వాదన అని కానీ, అది సరికాదన్నారు.
మంత్రివర్గం నిర్ణయం ద్వారానే వాన్పిక్ కేటాయింపులు జరిగాయన్నారు. కేబినెట్లో దాచిపెట్టారనే దానిలో వాస్తవం లేదన్నారు. మంత్రివర్గానికి తెలిసే నిర్ణయాలు అన్నీ జరిగాయని చెప్పారు. తాను చేసిన రాజీనామాకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని చెప్పారు. భూములు ఇవ్వాలా వద్దా అనే అంశాన్ని కేబినెట్లో పెట్టే నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకోగలరన్నారు. తన సొంతగా ఎవరికీ భూములు కట్టబెట్టలేదని, ఎక్కడా సంతకం పెట్టలేదన్నారు.
సిబిఐ సాంకేతిక అంశాలను లేవనెత్తిందని, తాను ఆరోపణల నుండి బయట పడగలనని భావిస్తున్నానని, కోర్టులపై తనకు నమ్మకముందని ఆయన చెప్పారు. ప్రభుత్వ శాఖలు భూములు కావాలంటే రెవెన్యూ శాఖనే కోరుతాయన్నారు. భూములు ఎవరికివ్వాలనే విషయం ఐ అండ్ ఐ నిర్ణయించగలుగుతుందని, ఇదే విషయాన్ని తాను బ్రహ్మానంద రెడ్డికి చెప్పానన్నారు. తన విషయంలో క్విడ్ ప్రోకో అంశాన్ని సిబిఐ లేవనెత్తలేదన్నారు. సాంకేతిక అంశాలే లేవనెత్తిందన్నారు.
ప్రభుత్వ నోడల్ వ్యవస్థగా ఐ అండ్ ఐ పని చేస్తోందన్నారు. కొన్ని పార్టీలు తమపై దిగజారి మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. భూములను కట్టబెట్టే అధికారం రెవెన్యూ శాఖకు లేదన్నారు. న్యాయవ్యవస్థ పటిష్టంగా పని చేస్తుందని, తన నిర్దోషిత్వం బయటపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను గ్రామస్థాయి నుండి మంత్రిగా కాంగ్రెసు పార్టీలో ఎదిగానని అన్నారు. తాను కాంగ్రెసువాదిగానే ఉంటానని చెప్పారు.
తనను ఎలా వినియోగించుకుంటుందో పార్టీ ఇష్టమన్నారు. తాను పార్టీ అభివృద్ధి కోసమే పాటుపడుతానని చెప్పారు. సబితా ఇంద్రా రెడ్డి కూడా ఎలాంటి తప్పు చేయలేదన్నారు. గతంలో ఉన్న చట్టాల ప్రకారమే సబితా ఇంద్రా రెడ్డి నడుచుకున్నారని చెప్పారు. ధర్మానను రాజీనామాపై ప్రశ్నించగా.. గతేడాదే ఆగస్టులోనే చేశానని చెప్పారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications