బలయ్యామని ధర్మాన, సబిత: ఎమ్మెల్యే పదవికీ రిజైన్!

మరోవైపు ధర్మాన ఇప్పటికే మంత్రి పదవితో పాటు తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖలు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవులకు రాజీనామా చేసిన ధర్మాన, సబితలను పలువురు మంత్రులు కలిసి పరామర్శించారు. మంత్రులు వట్టి వసంత్ కుమార్, ఏరాసు ప్రతాప్ రెడ్డిలు సోమవారం ఉదయం ధర్మానను కలిశారు.
ఈ సందర్భంగా వారితో ధర్మాన... తాము బలి పశువులమయ్యామని ఆవేదనగా చెప్పినట్లుగా తెలుస్తోంది. మంత్రివర్గం నిర్ణయాలను మాత్రమే తాను అమలు చేశానని, ఏ ఫైలు తన వద్ద ప్రారంభం కాలేదు, క్లోజ్ కాలేదని ఆయన చెప్పారని తెలుస్తోంది. మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రికి ఇచ్చానని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. ధర్మాన ప్రసాద రావు ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు విశాఖ వెళ్లనున్నారు. సబితా ఇంద్రా రెడ్డి ఇంటికి వట్టి వసంత్ కుమార్ వచ్చి పరామర్శించారు.
మరోవైపు కళంకిత మంత్రులపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళంకిత మంత్రులను తొలగించాలని డిమాండ్ చేశారు. కళంకిత మంత్రులను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాపాడుతున్నారని మండిపడ్డారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications