చిరు, జగన్లపై లోకేష్ విసుర్లు: బాబు మాత్రమేనంటూ..

ప్రస్తుతం రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగే నేత కావాలన్నారు. ఆ సమర్థత చంద్రబాబుకే ఉందన్నారు. కార్యకర్తలు అందరికీ ఆదర్శంగా నిలువాలని, అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సేవ చేయాలన్నారు. కలెక్షన్ కింగ్లను ఆదర్శంగా తీసుకుంటే సమాజారనికి అనర్థమేనని విమర్శించారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టవలసిన బాధ్యత టిడిపి కార్యకర్తల పైనే ఉందని ఆయన చెప్పారు.
టిడిపి అధికారంలోకి రాగానే పంచరత్నాలు అమలు చేస్తామన్నారు. టిడిపికి పత్రిక, ఛానల్ లేవని, అవి ఉంటే మనమూ జైల్లోనే ఉంటామని ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. రైతుల రుణమాఫీ, మద్యం గొలుసు దుకాణాలను రద్దు చేయిస్తామన్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా ఇంటింటికి మంచి నీటిని సరఫరా చేస్తామని చెప్పారు.
అన్ని వర్గాలకు ప్రత్యేక డిక్లరేషన్, నిరుద్యోగ భృతి, యువతకు ఉచితంగా ల్యాప్టాప్లు ఇస్తామన్నారు. సామాజిక సేవ, సామాజిక న్యాయం అన్న వాళ్లు సొంత సేవ, సొంత న్యాయం చూసుకొని వెళ్లిపోయారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిని ఉద్దేశించి అన్నారు.
బాబ్లీపై ఢిల్లీకి అఖిలపక్షం
బాబ్లీ ప్రాజెక్టు విషయమై అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకు వెళ్లేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో బాబ్లీ ప్రాజెక్టు పైన అఖిల పక్ష సమావేశం జరిగింది. పార్టీల అభిప్రాయాలు తీసుకొని అడ్వోకేట్లను నియమించాలని, అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్తామని, క్యురేటివ్ లేదా రివ్యూ పిటిషన్ వేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. కాగా ఈ భేటీలో సిపిఎం మినహా అన్ని పార్టీల నేతలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications