చంద్రబాబుతో భేటీ చిక్కులు: చీఫ్ విప్ గండ్ర వివరణ

ఇతర పార్టీల నాయకులతో సమావేశం కావాలంటే నాయకులు భయపడాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. వలసలు ఊపందుకున్న తరుణంలో ఈ భయాలు తప్పడం లేదు. ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారో తెలియని వాతావరణం ఉంది. ఈ స్థితిలో గండ్ర వెంకటరమణా రెడ్డి చంద్రబాబును కలిశారు.
ప్రభుత్వ చీఫ్ విప్గా కొనసాగుతూ ఉన్న గండ్ర వెంకటరమణారెడ్డి చంద్రబాబును కలవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన వివరణ ఇచ్చారు. తన కూతురు వివాహ శుభలేఖను ఇవ్వడానికి మాత్రమే తాను చంద్రబాబును కలిసినట్లు ఆయన తెలిపారు.
చంద్రబాబుతో రాజకీయాలు మాట్లాడలేదని, తన భేటీకి రాజకీయ కారణాలు ఏవీ లేవని ఆయన వివరించారు. చంద్రబాబు కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్న తరుణంలో కూడా వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం గండ్రకు ఏర్పడిందని అంటున్నారు.
More From
-
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications