క్లియర్: కాంగ్రెసులోకే, ప్రధాని విందుకు జయప్రద

Jayaprada
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ పార్లమెంటు సభ్యురాలు, సినీ నటి జయప్రద కాంగ్రెసు పార్టీలో చేరడం ఖాయమైపోయినట్లే. ఆమె రాజకీయ భవిష్యత్తుపై సందేహాలు వీడినట్లేనని చెప్పవచ్చు. యుపిఎ -2 ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇచ్చిన విందుకు జయప్రద బుధవారం రాత్రి హాజరయ్యారు. దీన్నిబట్టి ఆమె కాంగ్రెసులో చేరడం ఖరారైనట్లు భావిస్తున్నారు.

రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని, రాజమండ్రి నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తానని జయప్రద చాలా రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే, ఆమె ఏ పార్టీలో చేరుతారనే విషయం మాత్రం ఇప్పటి వరకు తేలలేదు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి ఆమె సిద్ధపడినట్లు కూడా వార్తలు వచ్చాయి. రాజమండ్రి సీటు కావాలనే ఆమె విజ్ఞప్తికి వైయస్సార్ కాంగ్రెసు నాయకత్వం హామీ ఇవ్వలేదని తెలిసింది.

జయప్రద ఆ మధ్య కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. సోనియాతో ఆమె భేటీ అత్యంత రహస్యంగా సాగింది. దాంతో జయప్రద కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడినట్లు భావించారు. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రస్తుతం కాంగ్రెసు పార్టీకే చెందిన ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాంతో ఆమె చేరిక అంత సులభం కాదని భావించారు.

జయప్రద కాంగ్రెసులోకి వస్తే తాను సహకరిస్తానని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. ఉండవల్లి అరుణ్ కుమార్‌ను రాజ్యసభకు నామినేట్ చేసి, జయప్రదకు రాజమండ్రి సీటు ఇవ్వడానికి కాంగ్రెసు అధిష్టానం సిద్ధపడినట్లు చెబుతున్నారు. జయప్రద అనకాపల్లి సీటు నుంచి పోటీ చేసే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+