వైయస్ను వదిలేసిన కాంగ్రెస్, పట్టించుకోని క్యాడర్

కార్యక్రమంలో వైయస్ రాజశేఖర రెడ్డి ఫోటో కనిపించలేదు. అంతేకాదు ఆ నేత పేరును కూడా ఎవరు ఎత్తలేదు! ఈ భేటీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణలు మాట్లాడారు. వారు ఎక్కడా వైయస్ పేరును పలకలేదు.
ముఖ్యమంత్రి తన ప్రసంగంలో వైయస్ పేరును చెప్పకుండా నాటి ముఖ్యమంత్రి అని చెప్పారు. బొత్స కూడా ఆ పేరును ఉచ్చరించలేదు. ఆనం రామనారాయణ రెడ్డి వైయస్ పేరును ఉచ్చరించినా.. ఆయన పేరును బజారుకీడుస్తారా అని మాత్రమే ప్రశ్నించారు. వైయస్ ప్రస్తావన లేకుండా గత సమావేశాలు గందరగోళమయ్యేవి. ఇప్పుడు మాత్రం సాఫీగానే సాగిపోవడం గమనార్హం.
ఈ సమావేశంలో నాయకులు ప్రధానంగా వైయస్సార్ కాంగ్రసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని, ఆయనకు చెందిన సాక్షి మీడియాను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీన్నిబట్టి వైయస్సార్ కాంగ్రెసుపై దూకుడు పెంచాలని కాంగ్రెసు పార్టీ నాయకులు అనుకంటున్నట్లు భావిస్తున్నారు. కాంగ్రెసు పట్టణ, మండల, బ్లాక్, డివిజన్ స్థాయి అధ్యక్షుల రాష్ట్ర స్థాయి సదస్సులో ముఖ్య నాయకులంతా జగన్ను, ఆయన పార్టీని నిందించారు.












Click it and Unblock the Notifications