ఎలా కొన్నారు: కిరణ్, బొత్సలకు జగన్ పార్టీ నేత ప్రశ్న

Gattu Ramachandar Rao
హైదరాబాద్: టీవీ చానెళ్లను కొనేంత డబ్బులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఎలా వచ్చాయని వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గట్టు రామచందర్ రావు అడిగారు. పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్‌ నేతలు, సీఎం సొంత డబ్బా బాగా మోగించుకున్నారని ఆయన అన్నారు. ప్రధాన ప్రతిపక్షాన్ని ఒక్కమాట అనలేదని, ప్రజాపక్షంగా ఉన్న తమ పార్టీపై మాత్రం పనిగట్టుకుని విమర్శలు చేశారని తెలిపారు.

వైయస్ రాజశేఖర రెడ్డి రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తూ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వందశాతం ఎల్లో మీడియా చంద్రబాబు భజన చేస్తోందని, వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకే సాక్షి పత్రిక పుట్టిందని తెలిపారు. 4 ఏళ్లలో సీఎం, బొత్సలకు వార్తా చానళ్లు కొనేంత డబ్బులు ఎలా వచ్చాయని బాబు ఎందుకు అడగడంలేదని ప్రశ్నించారు.

తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను ఆర్థిక ఉగ్రవాది అన్న మంత్రి ఆనమే మానసిక ఉన్మాది అని గట్టు దుయ్యబట్టారు. వైఎస్‌ హయాంలో ఆనం సోదరులు పిల్లుల్లాగా తిరిగారని గుర్తు చేశారు. సీఎం మారితే పదవి కోసం కిరణ్‌ను అంతకన్నా హీనంగా తిట్టగల ఆనం రామనారాయణరెడ్డిది నాలుక కాదు తాటిమట్ట అన్నారు.

ఎన్డీఏ మీద ఒత్తిడి పెంచి రూ.500, రూ.1000 నోట్లను తెచ్చిందే చంద్రబాబు అని గుర్తు చేశారు. స్టాంపు కుంభకోణం, దొంగనోట్ల ముద్రణలో టీడీపీ వారే అరెస్టయ్యారని అన్నారు. ఎన్నికల సమయంలో కోట్లాది రూపాయలు టీడీపీ నేతల నుంచే రికవరీ అయ్యాయని అన్నారు.

అలాంటి చంద్రబాబు రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేయాలంటే జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న బాబు, లోకేష్‌, ఆనం నాలుక కోయాలన్న కోపంలో ప్రజలున్నారని గట్టు రామచంద్రరావు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+