'శ్రీనివాసన్తో రిలేషన్: ఐపిఎల్ బెట్టింగ్లో జగన్ గ్యాంగ్'
బెట్టింగులో శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మీయప్పన్ను పోలీసులు అరెస్టు చేశారని, ఆయన పాత్ర స్పష్టమైందని, అతనితో జగన్కు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఉగ్రవాదం కన్నా ఆర్థిక నేరం చాలా ప్రమాదకరమైనదని సర్వోన్నత న్యాయస్థానం చెప్పిందని, ఆ విధంగా జగన్ జైలుకు వెళ్లి ఏడాది పూర్తవుతుంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆందోళన యోచన దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు.
ఇది కోర్టు ధిక్కారణకు పాల్పడటమే అన్నారు. తక్షణం వారిని అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డిల రాజీనామాను ఆమోదించిన గవర్నర్ నరసింహన్... పెరా కేసులో శిక్షపడిన మంత్రి పార్థసారథిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. పార్థసారథికి నైతిక విలువలు ఉంటే వెంటనే రాజీనామా చేయాలన్నారు. ముఖ్యమంత్రి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు.
కాగా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి కూడా ఇటీవల స్పాట్ ఫిక్సింగ్ కేసులో నెల్లూరులో పలువురు అరెస్టయిన సమయంలో ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. రాజకీయాలను ఆర్థికంగా మార్చిన నేతలు బెట్టింగులకు పాల్పడుతున్నారని మండిపడ్డ విషయం తెలిసిందే.