వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయాలు కాదు: ముఖ్యమంత్రితో భేటీపై రాములమ్మ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vijayashanthi
హైదరాబాద్: తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితై రాజకీయాలు మాట్లాడలేదని తెలంగాణ రాష్ట్ర సమితి మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి బుధవారం అన్నారు. ఆమె సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం మీడియా పలకరించింది. తాను కిరణ్‌తో రాజకీయాలు ప్రస్తావించలేదని, తన నియోజకవర్గం పనులపై కలిసినట్లు ఆమె చెప్పారు.

మెదక్ పట్టణంలో వైద్య కళాశాల మంజూరు చేయాలని కోరానని, ఎంఎంటిఎస్ ఫేజ్ 2 పనులు త్వరతగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశానని, అందుకు తన వంతు సహకారం అందిస్తానని ముఖ్యమంత్రికి చెప్పానన్నారు. మెదక్ - అక్కన్నపేట రైల్వేకు లైన్ ఏర్పాటుకు ఎంపీ నిధుల నుండి రూ.కోటి చెక్కును కిరణ్‌కు అందించినట్లు చెప్పారు.

బాబుపై హరీష్ రావు నిప్పులు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు బతికుండగా ఆయనపై చెప్పులు వేసి ఇప్పుడు ఆయన ఫోటోలకు పూలదండలు వేస్తున్నారని విమర్శించారు. అది ఆయన నైజం అన్నారు. తెలంగాణపై తీర్మానం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. 2008 తీర్మానానికి కాలం చెల్లిందని యనమల రామకృష్ణుడు చెప్పినప్పుడు మహానాడులో ఎందుకు స్పష్టత ఇవ్వలేకపోయారన్నారు.

బాబు ఒంటరిగా గెలిచింది ఎప్పుడని ప్రశ్నించారు. ఓసారి మామకు వెన్నుపోటి పొడిచి గద్దెనెక్కితే, రెండోసారి కార్గిల్ యుద్ధంతో బిజెపిని అడ్డుపెట్టుకొని గెలిచారన్నారు. తెలంగాణ ఆత్మహత్యలకు చంద్రబాబే కారణమన్నారు. టిడిపికి ఇస్తే చందాలు, తెరాసకు ఇస్తే వసూళ్లు అవుతాయా అన్నారు. టిడిపిని బాబు కాంగ్రెసుకు తాగట్టు పెట్టారని విమర్శించారు.

English summary
Medak TRS MP Vijayasanthi said that she has not discussed politics with CM Kiran Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X