వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు షాక్: 143.74 కోట్ల ఈడి ఆటాచ్‌కు ఆమోదం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ys Jagan
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడి) ఐదు నెలల క్రితం అటాచ్ చేసిన ఆస్తులను ఈడి న్యాయప్రాధికారిక(అడ్జుడికేటింగ్) సంస్థ గురువారం ఆమోదించింది.

ఈడి ఈ ఏడాది జనవరి 7వ తేదిన జగన్ కేసుకు సంబంధించి రూ.143.74 కోట్లను జప్తు చేసింది. ఇందులో రాంకీ గ్రూపుకు చెందిన 133.74 కోట్లు, జగన్ పబ్లికేషన్స్‌కు చెందిన రూ.10 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. ఈ మొత్తం జప్తును ఈడి న్యాయప్రాధికారిక సంస్థ ఆమోదించడం జగన్‌కు మరో షాక్.

కాగా వైయస్ జగన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ఐదు నెలల క్రితం కొరడా ఝులిపించిన విషయం తెలిసిందే. వైయస్ జగన్ ఆస్తుల కేసులో 143. 74 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను జప్తు చేస్తూ ఈడి ఈదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఈడి అప్పుడు ఓ ప్రకటన విడుదల చేసింది.

అంతకుముందు వైయస్ జగన్‌కు చెందిన 51 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను జప్తు చేసింది. ఇంతకు ముందు ఈడి వైయస్ జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్, జననీ ఇన్‌ఫ్రాకు చెందిన ఆస్తులను జప్తు చేసింది. తాజాగా ఇప్పుడు జగతి పబ్లికేషన్స్‌కు చెందిన పది కోట్ల రూపాయల విలువ చేసే మ్యూచ్‌వల్ ఫండ్స్‌ను, అయోధ్యా రామిరెడ్డికి చెందిన రాంకీ గ్రూప్‌నకు చెందిన 133.74 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను ఈడి జప్తు చేసింది.

English summary
Enforcement directotare (ED) has attached YSR Congress party YS Jagan's properties second time. ED has attched 143.74 crores value properties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X