జగన్కు షాక్: 143.74 కోట్ల ఈడి ఆటాచ్కు ఆమోదం
ఈడి ఈ ఏడాది జనవరి 7వ తేదిన జగన్ కేసుకు సంబంధించి రూ.143.74 కోట్లను జప్తు చేసింది. ఇందులో రాంకీ గ్రూపుకు చెందిన 133.74 కోట్లు, జగన్ పబ్లికేషన్స్కు చెందిన రూ.10 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. ఈ మొత్తం జప్తును ఈడి న్యాయప్రాధికారిక సంస్థ ఆమోదించడం జగన్కు మరో షాక్.
కాగా వైయస్ జగన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ఐదు నెలల క్రితం కొరడా ఝులిపించిన విషయం తెలిసిందే. వైయస్ జగన్ ఆస్తుల కేసులో 143. 74 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను జప్తు చేస్తూ ఈడి ఈదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఈడి అప్పుడు ఓ ప్రకటన విడుదల చేసింది.
అంతకుముందు వైయస్ జగన్కు చెందిన 51 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను జప్తు చేసింది. ఇంతకు ముందు ఈడి వైయస్ జగన్కు చెందిన జగతి పబ్లికేషన్స్, జననీ ఇన్ఫ్రాకు చెందిన ఆస్తులను జప్తు చేసింది. తాజాగా ఇప్పుడు జగతి పబ్లికేషన్స్కు చెందిన పది కోట్ల రూపాయల విలువ చేసే మ్యూచ్వల్ ఫండ్స్ను, అయోధ్యా రామిరెడ్డికి చెందిన రాంకీ గ్రూప్నకు చెందిన 133.74 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను ఈడి జప్తు చేసింది.