జగన్ కేసు: సబితా, ధర్మానలకు కోర్టు నోటీసులు

విచారణను ఈ నెల 13వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడిన అంశాలను లిఖికపూర్వకంగా తమకు సమర్పించాలని, మీడియాతో వారు ఏం మాట్లాడారో తెలపాలని కోర్టు సిబిఐని ఆదేశించింది.
ఈ నెల 13వ తేదీన నిందితుల తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది. లేదంటే, కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరే అవకాశం కూడా ఉంది. ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలను జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని సిబిఐ ఇది వరకు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వారు కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని, అందువల్ల వారిని జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించడం అవసరమని సిబిఐ కోర్టుకు తెలిపింది.
సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు కేసు దర్యాప్తును ప్రభావితం చేసే విధంగా మాట్లాడారని, వారిని జ్యుడిషియల్ కస్టడీకి పంపించకపోతే దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని సిబిఐ కోర్టుకు విన్నవించుకుంది. అయితే, తాము దర్యాప్తును ప్రభావితం చేసే విధంగా ఏమీ మాట్లాడలేదని, తాము ఏ తప్పూ చేయలేదని, కేసు నుంచి నిర్దోషులుగా బయటపడుతామని మాత్రమే చెప్పామని వారన్నారు.
ధర్మాన ప్రసాదరావును వాన్పిక్ వ్యవహారంపై కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో నిందితుడిగా సిబిఐ చేర్చింది. సబితా ఇంద్రారెడ్డిని దాల్మియా సిమెంట్స్ కేసులో నిందితురాలిగా చేర్చింది. ఈ నేపథ్యంలో వారిద్దరు మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications