జగన్ను జైల్లోను ఉండనివ్వరా: బాబుపై దాడి నిప్పులు

చంద్రబాబు రాయమంటేనే టిడిపి శాసన మండలి సభ్యుడు యనమల రామకృష్ణుడు లేఖలు రాస్తున్నారని ఆయన ఆరోపించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన కోపం ఉంటే ఆయనను రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప ఇలాంటి కుతంత్రాలు చేయకూడదని టిడిపికి సవాల్ విసిరారు.
చంద్రబాబు తన విశ్వసనీయతను తానే చంపుకుంటున్నారన్నారు. ఎదుటివారిని ఎలా దెబ్బతీయాలనే చంద్రబాబు నిత్యం ఆలోచిస్తుంటారని మండిపడ్డారు. జగన్ను జైలులో కూడా ఉండనివ్వకుండా ఆయనను ఏం చేయదలుచుకున్నారో చెప్పాలని విరుచుకుపడ్డారు. జైలులో జగన్ గదికి అడ్డుగా గోడలు ఏమైనా కట్టాలా అని ప్రశ్నించారు.
తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చంచల్ గూడ జైలులో నూకారపు సూర్య ప్రకాశ్ను కలిశానని, నియమ నిబంధనల మేరకే జైళ్లు పని చేస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో సిబిఐ చంద్రబాబు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్గా మారిందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications