బాబుకి కోపమెందుకో: జెసి, శకుని మామ: టిడిపి

అవసరమైతే తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలను బయటకు పంపించైనా సభను నిర్వహించాలన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఎందుకు కోపం వచ్చిందో తెలియదన్నారు. కుమ్మక్కు వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడు మండిపడ్డ విషయం తెలిసిందే.
అవమానించడమే: గాలి
సభలో తమకు మైక్ ఇచ్చి, కట్ చేయడమంటే ప్రతిపక్షాన్ని అవమానించడమేనని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్ని విషయాలపై మాట్లాడవచ్చు కానీ.. తాము ఏం మాట్లాడాలో స్పీకర్ చెబుతారా అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఏ ఒక్కరి సొత్తు కాదన్నారు. ఆనం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎవరికి మేనమామ కాదని టిడిపి నాయకులు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కాంగ్రెసు నేతలు ఎవరు చంద్రబాబును కలవాల్సిన అవసరం లేదన్నారు. జెసి దివాకర్ రెడ్డిని కాంగ్రెసుకు శకుని మామగా ఆయన అభివర్ణించారు.












Click it and Unblock the Notifications