జగన్, కెసిఆర్ మీడియాలకు నో ఎంట్రీ: చంద్రబాబు

రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం తరపున నిర్వహించే మీడియా సమావేశాలకు తమ రాజకీయ ప్రత్యర్థులైన జగన్, కెసిఆర్ ఆధ్వర్యంలో నడుస్తున్న మీడియా సంస్థల ప్రతినిధులను ఆహ్వానించరాదని, తమ కార్యాలయాలలోకి వారిని అనుమతించరాదని, ఈ సంస్థల చర్చా గోష్టుల్లో నేతలు ఎవరూ పాల్గొనరాదని నిర్ణయం తీసుకున్నారు.
'సాక్షి పత్రిక, సాక్షి చానల్, టీ న్యూస్ చానల్ ఆయా పార్టీలకు అనుబంధంగా పనిచేస్తున్నాయని, పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగపరుస్తున్నాయని చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చారు. తాము ఏం చెప్పినా రాయరు...చూపించరని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ సమావేశం తర్వాత ఆ పార్టీ అధికార ప్రతినిధి ముద్దు కృష్ణమ నాయుడు చెప్పారు.
ఇదిలావుంటే, రైతాంగ సమస్యలపై గన్పార్క్ వద్ద తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో ఎమ్మెల్యేలు బుధవారం ధర్నా చేపట్టారు. ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో రైతాంగం కుదేలైందని చంద్రబాబు మండిపడ్డారు. కౌలు రైతులకు రుణసహాయం అందడం లేదని విమర్శించారు. రైతాంగ సమస్యలపై ప్రభుత్వం దిగివచ్చే వరకు రాజీలేని పోరాటం చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications