ఏకపక్షమా: కెసిఆర్ బంద్ పిలుపుపై సిపిఐ, బిజెపి గుర్రు
తెలంగాణ జెఎసితో చర్చించిన తర్వాత తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి చెప్పారు. బంద్కు కెసిఆర్ ఏకపక్షంగా బంద్కు పిలుపునివ్వడం సమంజసం కాదని నారాయణ అన్నారు. కాగా, కెసిఆర్పై తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఇతర పార్టీలను సంప్రదించకుండా కెసిఆర్ ఏకపక్షంగా బంద్కు పిలుపునివ్వడాన్ని ఆయన వ్యతిరేకించారు.
ఫామ్ హౌస్లో కూర్చుని బంద్కు పిలుపునివ్వడం కాదని పార్లమెంటులో బిల్లు పెట్టాలని డిమాండ్ చేయాలని ఎర్రబెల్లి దయాకర్ రావు కెసిఆర్కు సలహా ఇచ్చారు. చలో అసెంబ్లీలో తమ పార్టీ పూర్తి స్థాయిలో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. తమ నాయకులపై రాళ్ల దాడి చేసే నీచ స్థాయికి తెరాస నాయకులు దిగజారారని ఆయన ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ శాసనసభ్యులపై కూడా దాడి చేశారని ఆయన ఆరోపించారు. చలో అసెంబ్లీని ఓడించేందుకు ప్రభుత్వం ఓవర్ యాక్షన్ చేసిందని ఆయన వ్యాఖ్యానించారు.
చలో అసెంబ్లీ సందర్భంగా అరెస్టు చేసి గోల్కోండ పోలీసు స్టేషన్కు తరలించిన తెరాస శాసనసభ్యులను పోలీసులు శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. ట్యాంక్బండ్, సచివాలయం తదితర మార్గాల్లో విధించిన ఆంక్షలను ఎత్తేశారు. బంద్ సందర్భంగా రేపు జరగాల్సిన పరీక్షలను కాకతీయ, ఉస్మానియా, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయాలు వాయిదా వేశాయి.