టి - బంద్కు మిశ్రమ స్పందన: హరీష్, నేతల అరెస్టు

కాగా, హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో బంద్ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. డిపోల ఎదుట బైఠాయించిన తెరాస నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆర్టీసి బస్సులు యధావిధిగా నడుస్తున్నాయి. జిల్లాల్లో ఎక్కడికక్కడ తెరాస నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో నియోజకవర్గం ఇంచార్జీ జీవన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసారు. ఆయనతో పాటు పార్టీ కార్యకర్తలను, నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్మూర్ రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. దుకాణాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. వరంగల్లోనూ పోలీసులు తెరాస నాయకులను అరెస్టు చేశారు. తెరాస జిల్లా అధ్యక్షుడు రవీందర్ రావుతో సహా 50 మందిని అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ బంద్ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా శనివారం తెల్లవారు జామున ఏదుట్ల, రేమద్దెల గ్రామాల మధ్య రెండు ఆర్టీసి బస్సులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు ఓ బస్సు పూర్తిగా దగ్ధం కాగా, మరో బస్సు పాక్షికంగా కాలిపోయింది. గద్వాల, అచ్చంపేటల్లో మాత్రం బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
నల్లగొండ జిల్లాలో కూడా డిపోల వద్ద బైఠాయించిన తెరాస నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. బంద్కు సంఘీభావం తెలుపుతూ కరీంనగర్ జిల్లాలోని సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. హుజురాబాద్ డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా తెరాస నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. కరీంనగర్ జిల్లాలో విద్యాసంస్థలు బంద్ను పాటిస్తున్నాయి.
రంగారెడ్డి జిల్లా పరిగి డివిజన్లో కొందరు వ్యక్తులు బస్సులను అడ్డుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బస్సులను అడ్డుకోవడానికి ప్రయత్నించి తెరాస శానససభ్యుడు జోగు రామన్నను పోలీసులు అరెస్టు చేశారు. నిర్మల్లో ఆందోళనకారులు ఓ బస్సు అద్దాలను పగులగొట్టారు. ఇదే జిల్లాలోని పానగల్లో రెండు ఆర్టీసి బస్సులను ఆందోళనకారులు తగులబెట్టారు.












Click it and Unblock the Notifications