మరో కుట్ర జరుగుతోంది: కాంగ్రెస్, టిడిపిపై షర్మిల ఫైర్
రాష్ట్రంలో మరో కుట్ర జరుగుతోందని, కిరణ్ సర్కారు ఎస్సీ, ఎస్టీ, బిసి రిజర్వేషన్లను బాగా తగ్గించి అణగారిన వర్గాలకు అవకాశాలు లేకుండా చేస్తోందని ఆరోపించారు. ఎస్సీ ఉప ప్రణాళిక అంతా ఒక బూటకమని, లేని అభివృద్ధిపై వందల కోట్ల రూ పాయలు ప్రచారానికి ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. తమ పార్టీ ప్రభంజనంతో టిడిపి, కాంగ్రెసు పార్టీల నేతలకు నిద్ర పట్టడం లేదని ఆమె ఆగ్రహం విమర్శించారు.
స్థానిక ఎన్నికలలో ఎలాగైనా పరువు దక్కించుకోవాలే నీచమైన ఆలోచనలు ఆ పార్టీలు చేస్తున్నాయన్నారు. ‘వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్థానిక సంస్థలకు జీవం పోశారు. స్థానిక సంస్థలకు మంచినీరు, విద్య, వైద్యంలాంటి పనులు అప్పజెప్పి నిధులు, విధులు కేటాయించారు. అంతేకాదు సర్పంచులకు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు, కార్పొరేటర్లకు, మేయర్లకు గౌరవ వేతనం పెంచి ప్రొటోకాల్ కల్పించిన ఘనత కూడా రాజశేఖర రెడ్డిదే.
స్థానిక సంస్థలకు చెక్ పవర్ ఇచ్చిన ఘనత, స్థానిక సంస్థల ప్రతినిధులు కౌన్సిల్లో నాయకులను ఎంచుకునే అవకాశం కల్పించింది కూడా ఆయనే. స్థానిక సంస్థలను అంతలా గౌరవించారు రాజశేఖర రెడ్డి. ఇప్పుడున్న కాంగ్రెస్, టిడిపి నాయకులకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు కనుకనే ఎస్సీలు, బీసీలు, ఎస్టీల పొట్ట కొట్టాలని ఈ రోజు నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.