కెఎల్ఆర్ లేఖపై జానా డోంట్ కేర్, మంత్రుల ముచ్చట్లు
తెలంగాణ నేతల సమావేశం గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని మంత్రి ప్రసాద్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తాను ఎక్కడికైనా వెళ్తానని చెప్పారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతల సమావేశంపై తనకు సమాచారం ఉంటే వెళ్తానని చెప్పారు.
కబుర్లలో మంత్రులు... బొత్స పిలుపు
మంగళవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సమయంలో పలువురు మంత్రులు లాబీల్లో కబుర్లలో మునిగిపోయారు. దీంతో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ విప్లతో వారికి సభకు రావాలని కబురు పంపించారు.
నకిలీపై సమాచారం లేదు: కన్నా
నకిలీ విత్తనాలపై తనకు ఎలాంటి సమాచారం లేదని మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ మంగళవారం చెప్పారు. నకిలీ విత్తనాలపై ఎవరైనా సమాచారం ఇస్తే వారి వివరాలను బయట పెట్టమని చెప్పారు. నకిలీ విత్తనాలు లేవని తాను చెప్పనని, వాటిని అరికడుతామన్నారు. రెండు రోజుల్లో సోయాబిన్ చిక్కుడు విత్తన సమస్యను పరిష్కరిస్తామని, మధ్య ప్రదేశ్ నుండి విత్తనాలు తెప్పిస్తున్నామన్నారు.