వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పార్టీ విఫలం, టిడిపి: తెలంగాణపై కోదండరామ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించడంలో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ విఫలమయ్యాయని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. జెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశానంతరం ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ ద్రోహులైన తెలుగుదేశం, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులను గ్రామాల్లోనికి రానివ్వమని ఆయన హెచ్చరించారు.

కాంగ్రెసు తెలంగాణ నేతలకు అల్టిమేటం ఇచ్చారు. వచ్చే నెల 4వ తేదీలోగా కాంగ్రెసు తెలంగాణ నేతలు తేల్చుకోవాలని, లేదంటే గ్రామాల్లో అడుగు పెట్టనివ్వబోమని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీని లక్ష్యంగా చేసుకుని కార్యాచరణ రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమ కార్యాచరణ విషయంలో వెనకడుగు వేసేది లేదని చెప్పారు. చలో అసెంబ్లీ సందర్భంగా ఉద్యమకారులపై ప్రయోగించిన నిర్బంధకాండపై ప్రజాకోర్టులు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

నిబంధనల ఉల్లంఘనపై కోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేస్తామని కూడా ఆయన చెప్పారు. ఈ నెల 21వ తేదీన తెలంగాణ ఆత్మగౌరవ దినం పాటిస్తామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా గ్రామాల్లో సభలు నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు కోసం అవసరమైతే మరోసారి సకల జనుల సమ్మె నిర్వహిస్తామని చెప్పారు.

తెలంగాణపై కాంగ్రెసు వైఖరి మీద ఢిల్లీలో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఎన్జీవోల నాయకుడు దేవీ ప్రసాద్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ వ్యతిరేకులకు ప్రజలు బుద్ది చెప్తారని ఆయన అన్నారు.

English summary
Telangana political JAC chairman Kodandaram said that YS Jagan's YSR Congress party and Nara Chandrababu Naidu's Telugudesam party failed on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X