వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరసింహన్ భేటీలు: తెలంగాణపై నిర్ణయమేనన్న షిండే

By Pratap
|
Google Oneindia TeluguNews

Sushil kumar Shinde
న్యూఢిల్లీ: తెలంగాణపై నిర్ణయం తీసుకునే దిశగా చర్చలు సాగుతున్నాయని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌‌ తనతో సమావేశమైన తర్వాత ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణపై చర్చలు కీలక దశలో ఉన్నాయని ఆయన అన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోగానే మీడియాకు చెప్తామని కూడా అన్నారు. తనతో గవర్నర్ తెలంగాణపై కూడా మాట్లాడినట్లు తెలిపారు. రాష్ట్ర పరిస్థితులను గవర్నర్ వివరించినట్లు చెప్పారు.

కాగా, కేంద్ర మంత్రులతో భేటీ అవుతూ నరసింహన్ ఢిల్లీలో బిజీగా గడిపారు. సుశీల్ కుమార్ షిండేను ఆయన మూడు సార్లు కలిసినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు పి. చిదంబరం, ఆంటోనీలతో కూడా నరసింహన్ సమావేశమయ్యారు. తెలంగాణపై ఆయన కేంద్ర మంత్రులతో విస్తృత చర్చించినట్లు చెబుతున్నారు. రాష్ట్ర పరిస్థితులపై ఆయన ఓ నివేదిక సమర్పించినట్లు ప్రచారం సాగుతోంది.

ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కూడా నరసింహన్ కలిశారు. ప్రధానితో ఆయన దాదాపు అరగంట పాటు సమావేశమయ్యారు. నరసింహన్ సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. తెలంగాణపై తాను సుశీల్ కుమార్ షిండేతో చర్చించలేదని నరసింహన్ మీడియా ప్రతినిధులతో అన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగానే ఉన్నాయన్నారు.తెలంగాణ అంశాన్ని కేంద్రమే పరిష్కరించాలని తెలిపారు. తెలంగాణపై కేంద్రానికి తాను ఎలాంటి నివేదికను ఇవ్వలేదని వెల్లడించారు. మరో రెండు రోజులు ఢిల్లీలోనే ఉంటానని, రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్‌తో కూడా సమావేశమవుతానని గవర్నర్ నరసింహన్ చెప్పారు.

English summary
After meetin Andhra Pradesh governor Narasimhan, the Union home minister Sushil kumar Shinde said that discussions on Telangana issue are going on.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X