వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్యాకేజి తీసుకోండి: సీమాంధ్ర మంత్రులు, ఢిల్లీకి డిసిఎం

By Srinivas
|
Google Oneindia TeluguNews

sailajanath and damodara rajanarasimha
హైదరాబాద్: తమ నినాదం సమైక్యవాదమేనని మంత్రి శైలజానాథ్ మంగళవారం అన్నారు. సమైక్య రాష్ట్రాన్నే సీమాంధ్ర నేతలం కోరుకుంటున్నామని చెప్పారు. తెలంగాణ రాదని, ఒకవేళ కేంద్రం తెలంగాణ ఇస్తే ఏం చేయాలో అప్పుడు నిర్ణయిస్తామని శైలజానాథ్ చెప్పారు. తెలంగాణపై నిర్ణయానికి ఇది సరైన సమయమని మంత్రి కొండ్రు మురళి అభిప్రాయపడ్డారు. తెలంగాణపై ఏదో ఒకటి తేల్చాలన్నారు.

తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే తాము స్వాగతిస్తామని మంత్రి టిజి వెంకటేష్ చెప్పారు. అదే సమయంలో వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతానికి కూడా ప్యాకేజీ కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ విషయంలో ఏం చేయాలనే అంశంపై సీమాంధ్ర నేతల భేటీపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ప్యాకేజీ తీసుకొండి: హర్ష కుమార్

తెలంగాణ ప్రాంతం వెనుకబడిందన్న తెలంగాణ రాజకీయ నాయకులు ప్రత్యేక ప్యాకేజీని తీసుకొని తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని పార్లమెంటు సభ్యుడు హర్ష కుమార్ సూచించారు. ఆంధ్రా నేతలు దోపిడీ చేశారన్న తెలంగాణ ప్రాంత నేతలు అవేమిటో గణాంకాలతో సహా బయట పెట్టాలన్నారు.

ఢిల్లీ బాటలో మంత్రులు

తెలంగాణకు భారీ ప్యాకేజి ఇస్తారనే ప్రచారం నేపథ్యంలో మంత్రులు ఢిల్లీ బాట పడుతున్నారు. ఇప్పటికే శాసన మండలి సభ్యుడు డి.శ్రీనివాస్, గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం ఢిల్లీ వెళ్లారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి కూడా వెళ్లే అవకాశాలున్నాయి. మరికొందరు తెలంగాణ మంత్రులు కూడా వెళ్లనున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు వెళ్లనున్నారు.

English summary

 Deputy CM Damodara Rajanarasimha reached New Delhi to discuss Telangana issue with Congress Party High Command.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X