తట్టను ఎత్తిన షర్మిల: ఈ రోజు 2,500కి.మీ.మైలురాయి
రాజమండ్రి: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తోంది. ప్రజలతో మమేకమవుతూ ఆమె పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఆదివారం నాటికి ఆమె పాదయాత్ర 188వ రోజుకు చేరుకుంటుంది. ఈ రోజుతో షర్మిల పాదయాత్ర 2,500 కిలోమీటర్లు పూర్తి చేసుకోనుంది. పాదయాత్రలో ప్రజలకు హామీలు, భరోసా ఇస్తూ.. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ పైన నిప్పులు చెరుగుతూ సాగుతున్నారు.
తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్నాయని, అలాంటి కుటిల రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పాలని ఆమె చెబుతున్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలోని సమస్యలు పరిష్కారమవుతాయని భరోసా ఇస్తున్నారు. ప్రజల కోసమే జగన్ కాంగ్రెసు పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించారని చెబుతున్నారు.

షర్మిల చిన్నారులను ముద్దాడుతూ, పెద్దలను పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. శనివారం ఆమె ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఉపాధి కూలీలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. తట్టను నెత్తిన పెట్టుకొని అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ సమయంలో ఆమె తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలపై నిప్పులు చెరిగారు. ప్రస్తుత ప్రభుత్వం హయాంలో నాటి చంద్రబాబు పాలనే కనిపిస్తోందని దుయ్యబట్టారు.
ఆదివారం తుని నియోజకవర్గంలోని కాకరాపల్లిలో షర్మిల 2,500 కిలోమీటర్ల మైలురాయిని దాటనున్నారు. ఓ మహిళ ఇన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం గమనార్హం. నిన్నటి వరకు షర్మిల 181 రోజులు నడిచి, 91 నియోజకవర్గాల్లో పర్యటించారు. కాకరాపల్లిలో షర్మిల దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications