తట్టను ఎత్తిన షర్మిల: ఈ రోజు 2,500కి.మీ.మైలురాయి
రాజమండ్రి: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తోంది. ప్రజలతో మమేకమవుతూ ఆమె పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఆదివారం నాటికి ఆమె పాదయాత్ర 188వ రోజుకు చేరుకుంటుంది. ఈ రోజుతో షర్మిల పాదయాత్ర 2,500 కిలోమీటర్లు పూర్తి చేసుకోనుంది. పాదయాత్రలో ప్రజలకు హామీలు, భరోసా ఇస్తూ.. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ పైన నిప్పులు చెరుగుతూ సాగుతున్నారు.
తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్నాయని, అలాంటి కుటిల రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పాలని ఆమె చెబుతున్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలోని సమస్యలు పరిష్కారమవుతాయని భరోసా ఇస్తున్నారు. ప్రజల కోసమే జగన్ కాంగ్రెసు పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించారని చెబుతున్నారు.

షర్మిల చిన్నారులను ముద్దాడుతూ, పెద్దలను పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. శనివారం ఆమె ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఉపాధి కూలీలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. తట్టను నెత్తిన పెట్టుకొని అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ సమయంలో ఆమె తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలపై నిప్పులు చెరిగారు. ప్రస్తుత ప్రభుత్వం హయాంలో నాటి చంద్రబాబు పాలనే కనిపిస్తోందని దుయ్యబట్టారు.
ఆదివారం తుని నియోజకవర్గంలోని కాకరాపల్లిలో షర్మిల 2,500 కిలోమీటర్ల మైలురాయిని దాటనున్నారు. ఓ మహిళ ఇన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం గమనార్హం. నిన్నటి వరకు షర్మిల 181 రోజులు నడిచి, 91 నియోజకవర్గాల్లో పర్యటించారు. కాకరాపల్లిలో షర్మిల దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications