వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మమ్మల్ని దెబ్బతీసేందుకే రాయల తెలంగాణ: జగన్‌పార్టీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sobha Nagi Reddy
హైదరాబాద్/ఖమ్మం: తమ పార్టీ రాయల తెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే శోభా నాగి రెడ్డి వేరుగా అన్నారు. తమ పార్టీని దెబ్బ తీసేందుకే కేంద్రం రాయల తెలంగాణ ప్రతిపాదన ముందుకు తీసుకు వస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గుర్తించింది: విజయమ్మ

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలకు భరోసా ఇచ్చే నాయకుడు లేడని, ప్రజలకు ఏం కావాలో తమ పార్టీ గుర్తించిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గురువారం అన్నారు. ఆమె ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. పార్టీకి ప్రజల్లో తిరుగులేని ఆదరణ ఉందన్నారు. స్థానిక ఎన్నికలే పార్టీకి పునాది అని, పంచాయతీ ఎన్నికల్లో సత్తాచాటాలని ఆమె పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.

స్థానిక సంస్థల ఎన్నికల గడువు ముగిసినా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించక పోవడంతో పంచాయతీలు చతికలపడ్డాయన్నారు. ఏదో కారణం చెప్పి ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేస్తోందన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని, కాంగ్రెసు, టిడిపి కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలను కోరారు.

పంచాయతీ ఎన్నికలలో పార్టీకి అఖండ మెజార్టీతో విజయం సాధించి పెట్టాలన్నారు. ఇందుకోసం నాయకులు సమష్టిగా కృషి చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాలన నాడు చంద్రబాబు నాయుడు పాలనను తలపిస్తోందని విమర్శించారు.

English summary
YSR Congress Party MLA Sobha Nagi Reddy on Thursday said that YSRCP is against to Rayala Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X